16, ఏప్రిల్ 2011, శనివారం

అందాల నీడలు..!!


"కౌసల్య సుప్రజా రామా పూర్వా సన్ధ్యా  ప్రవర్తతే...
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికం..." 
హలో.. ఇలా సుప్రభాతం చదవటం అంటే దాని అర్ధం తెల్లారింది అని..! ఇప్పుడు ఉన్నట్టుండి ఎలా చదివేస్తున్నాడేంటని అనుకుంటున్నారేమో..!! పొద్దున్నే  ద్వారకా తిరుమల స్వామి వారి దర్శనం అయిపోయాక వెంటనే బయల్దేరి పాలకొల్లు వెళ్లాలని ఆలోచన..! కానీ అనుకున్న సమయానికి బయల్దేరలేకపోవటం వల్ల... భీమవరంకి ముందు వెళ్లాలని నిర్ణయించేసుకుని... అక్కడికెళ్ళిపోయాం... ద్వారకా తిరుమల నుండి భీమవరంకి మూడు గంటలు ప్రయాణం..! అద్దీ.. ఇక్కడే అసలు విషయం; ప్రకృతి... అందాలు... పచ్చదనం... పొలాలు... పచ్చిక  బయళ్ళు... చెట్లూ...తోటలూ... పంట కాలువలూ... అబ్బో... ఒకటేమిటిలే...అసలు ఈ మూడు గంటల ప్రయాణం  మాత్రం... మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది..!

ఎంత అందంగా ఉంటుందంటే దారి మొత్తం... ఓహ్...అసలు ఒకటని చెప్పలేం. దారి.. దాని పక్కనే కుడి వైపు ఇళ్ళు, ఎడమ వైపు పంటకాలువ... అది కనీసం పది అడుగుల వెడల్పుతో ఉంటుంది... పెద్దగా లోతు ఉండదు..మహా అయితే ఓ పది అడుగులు ఉంటుందేమో..! ప్రతి ఒకటి రెండు కిలోమీటర్లకి ఒకచోట ఆ పంట కాలువని ఆనుకుని  ఓ చిన్న గుడి...రాముల వారిదో... కృష్ణుడిదో... శివాలయమో... అమ్మవారో... సాయిబాబానో...ఇలా ఎవరో ఒకళ్ల ఆశీస్సులు..! ఆ గుడి వెంబడే మెట్లు ఉంటాయి... అక్కడే అక్కడి వాళ్ళు బట్టలు ఉతుక్కోవటం...ఈతలు కొట్టటం... అసలు ఎంత అందమైన జీవితం వాళ్ళది...హాయిగా ఉంటున్నారు అనిపించింది..! ఇక్కడే అసలు విషయం ఒకటి గమనించాలి... దారికి ఎడమ వైపున పంట కాలువ ఉంది కదా.. దాని అవతల కనుచూపు మేరలో  పొలాలు... ఎక్కడా కనీసం ఒక్క చోటైనా... కనీసం ఒక్క అడుగైనా వ్యర్ధంగా వదిలేసిన స్థలం అనేది కనిపించదు... అంతలా ఉపయోగించేస్తారు అక్కడి వాళ్ళు భూమిని..! అయితే ఏదో ఒక పంట...లేదంటే... ఏదో ఒక చెట్టు... ఇంక ఉపయోగించకుండా వదిలేసిన నేల అనేది ఎక్కడుంటుంది... అవకాశమే లేదుగా..! సరే అక్కడి వరకు బానే ఉంది... కొన్నిచోట్ల అయితే మరీను... పొలం గట్ల వెంబడి వరసగా కొబ్బరి చెట్లు.. సైనికులు నిలబడ్డట్టుగా ఎంత అందంగా  ఉంటుందో చూడటానికి..! మనుషులకి క్రమశిక్షణ అంటే ఏంటో మనం నేర్పిద్దాం అన్నట్టు ఉండే పొడుగైన చెట్లు..! వాటిని చూస్తే తెలుస్తుంది... మనసు క్రమశిక్షణతో ఉంటే... జీవితం కూడా క్రమశిక్షణతో ఉంటుంది... అప్పుడు ఆరోగ్యం దానంతట అదే వస్తుంది అని చెప్పేట్టుగా దేహ దారుఢ్యంతో ఉంటాయి అక్కడి చెట్లు..! అద్భుతంలే..! ఒక్కో చెట్టు నుండి ఒక్కో సందేశం..! భూమీ, నీరు, ఆకాశం... ఎక్కడ చూసినా చెట్లే..! అదేంటీ.. నీటిలో ఎలా ఉంటాయి అంటారా... అవును, ఎక్కడ పడితే అక్కడ సెలయేళ్ల లాంటి అందమైన పంట కాలువలు ఉంటే మరి వాటిలో  కనిపించేది అక్కడి చెట్ల ప్రతిబింబాలేగా..! మరి ఆకాశంలో ఉండటం ఎలా సాధ్యం అంటారా ..మరి మన మీద ఎండ పడితే మనం ఎక్కడ కందిపోతామో లేక ఎక్కడ విలవిలలాడిపోతామో అని అనుకున్నాయో ఏమో... మనన్ని అతి జాగ్రత్తగా రక్షిస్తూ... ఎటు చూసినా సరే...అంత తొందరగా మనకి సూర్యుడి ప్రతాపం తగలకుండా కప్పేసి ఉంచుతాయి... వాటి చల్లటి గాలిని కూడా మనకి అందిస్తూ..! మరి ఆకాశంలో ఎటు చూసినా చెట్లు మాత్రమే ఉంటేనే కదా మనకి ఇంత హాయిగా ఉండేది ..! మనుషులలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ మాత్రం జాలి లేని ఈ రోజుల్లో... పాపం మనకి ఏమౌతుందో... మనం ఏమైపోతామో అనే తపనతో, ప్రేమతో... అవి ఎండలో మాడుతూ... మనన్ని రక్షించుకుంటున్నాయి ఆ కదలలేని మూగజీవాలు..! మరి మనం అలా వాటిచేత రక్షించబడితేనే కదా వాటికి కావలసినంత పోషణ చెయ్యగలిగేది... ఇది కూడా ఆలోచించి ఉంటాయి ఆ వృక్షాలు...! అంటే మన చేత బతికించబడుతూ... మనన్ని బతికిస్తూ...!! అసలిది ఎంత గొప్ప తత్త్వమో కదా అనిపిస్తుంది..! కష్టంలో దైవం ఉంటుంది అంటారు... దైవానికి ఒక రూపం వస్తే... అది ఇలా మానవాళికి మేలు చేసే పచ్చదనంగా శోభిల్లుతుందేమో అన్నట్టుగా కూడా అనిపించింది నాకు అక్కడి అందాలని చూస్తుంటే..! ఒక్కో మలుపు దగ్గర ఒక్కో అద్భుతమైన దృశ్యం..! అక్కడి మనుషుల ఆతిధ్యం గురించి ఇక చెప్పనే అక్కర్లేదు..! ఇది కొత్త విషయం ఏం కాదనుకోండి... కానీ ఆంధ్ర వైపు అనగానే ఎందుకో తెలీకుండానే అభిమానం వచేస్తూ ఉంటుంది...! గుంటూరు ప్రాంతాలలో  తిరుగుతున్నప్పుడు ఒక రకంగా... గోదావరి ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు ఒక రకంగా... ఇలా రకరకాల అనుభూతులు... అన్నీ మంచివే... అన్నీ సంతోషం కలిగించేవే... అవన్నీ మనవే అనిపించేట్టు..! ఏమిటోలే...! అక్కడి ఊళ్లలో తిరుగుతున్నంతసేపు ఒకటే భావన... అసలు నాగరికతకి మనం ఎంత దూరం అయిపోతున్నాం... నాగరికులం అని చెప్పుకునే మనం ఎంత అనాగరికంగా ఉంటున్నాం... సున్నితత్త్వం నీడలో ఎంత మోటుగా బతుకులీడుస్తున్నాం... రసాత్మక జీవితాన్ని ఎంతగా వదులుకుంటున్నాం... ధనాత్మక జీవితానికి ఎంతగా అలవాటు  పడిపోయి శ్లేష్మంలో పడ్డ ఈగ లాగా ఎంత దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం... ఇలా ఏవో ఏవేవో భావాలు  మనసులో..! బస్సులో వెళ్తున్నంత సేపు ఇవే..!

ఇక్కడే, ఈ అందాలని ఆస్వాదిస్తున్నంతలోనే మనసులో ఉన్నట్టుండి ఆవేదన..! కారణం.. ఈ అందాల మాటున కొన్ని భయంకరమైన నిజాలు... మనిషి తనలోని లోపాలనీ, బలహీనతలనీ బయటపెట్టుకునే విధంగా... కొన్ని నీచ ప్రవర్తనలు..! ఇక్కడ లేనిది అక్కడేముందని అక్కడి వస్తువు మీద అంత మమకారం..! మనది కాని దాని మీద మనకెందుకు అంత ఆత్రం..! సమాధానాలు లేని, సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఇవి..! ఎందుకంటే సమాధానం తెలిసినా కూడా, అవతలి విషయాల మీద మమకారం, వాటి వల్ల  అంతర్లీనంగా వస్తున్న లాభం... అయాచిత వరం... అది విషసమానం అని తెలిసినా కూడా అదే ధోరణి..!  ఆ గోదావరి ప్రకృతి అందాలు, వాటి నీడలు ఎంతగా ఆహ్లాదాన్ని అందిస్తాయో, ఆ నీడల మాటున జరిగే విషయాలు ఒక్కసారి తరచి చూస్తే అంతకంటే భయంకరమైన సత్యాలని తెలియచేస్తాయి..!
ప్రాంతీయ విభేదాల నుండి పాశ్చాత్య దేశాల కక్కుర్తి దాకా చాలా విషయాలు కారణాలుగా కనిపిస్తాయి అక్కడ జరుగుతున్న ఆ దారుణాల వెనుక..!
మన సంస్కృతిని వదిలి పరమత ఆచారాలు..!
వేలాది సంవత్సరాల చరిత్ర వున్న హైందవంలో లేని అందం, నిన్న మొన్న పుట్టిన మతంలో ఉందీ అని వాదించటం..!
అన్నిటికీ సమాధానాలు చెప్తూ, అన్ని సందర్భాలలోనూ కాపాడుతూ వచ్చే హైందవ సంస్కృతిని వదిలి, ఎన్నో ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు వెతుక్కుంటున్న మతాల వెంట పడటం..!
ఏంటిదీ...? ఎందుకిలా జరుగుతోంది..? మన దేశంలోనే ఇలా జరుగుతోందా..? ప్రపంచమంతటా అలాగే ఉందా..?ప్రపంచమంతటా అలాగే ఉంటే, మరి వాళ్ళ దేశాల్లో అటువంటి ఛాయలు కనపడవేం..?
పైగా, మతం మార్పిడి ఎందుకు చేసుకోవాల్సొచ్చింది అని అక్కడి వాళ్ళని ఎవరినైనా అడిగితే, మనశ్శాంతి కోసం అంటూ దానికి ఓ బంగారు పూత..! ఎందుకీ దాపరికపు విషక్రీడ..! హిందువుగా పుట్టటమే అదృష్టం అని అనుకునే సంస్కృతి నుండి మతం మారడమే పరమావధి అన్నట్టు నీచంగా వ్యవహరిస్తూ దిగజారటం..! సింధు నాగరికతలో లేని మనశ్శాంతి అన్యమతంలో ఎక్కడిదీ..? మనశ్శాంతి అనేది ఎలా వస్తుంది..? మతాన్ని బట్టి మనశ్శాంతి అనేది ఉంటే, మరి ఇన్ని మతాలెందుకు? పురాణ ప్రజలకి తెలీదా ఇన్ని మతాలు ఉండటం అనవసరం అని...? కేవలం మనశ్శాంతితోనే బతికేలా ఎందుకు నేర్పించలేదు వాళ్ళు...? హైందవ సంసృతి అనేది ఒక మతం కాదు...నిజానికి అది ఒక జీవన శైలి..! ఇలా జీవిస్తే మనసు బావుంటుంది, ఇలా ప్రవర్తిస్తే మనశ్శాంతి కలుగుతుంది, ఇలా సంభాషిస్తే దైవానికి దగ్గరవుతాం.. ఇలా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అంటూ అడుగడుగునా మార్గదర్శనంగా ఉంటున్న మన సంస్కృతిలో లేనిది అక్కడ ఎక్కడి నుండి వచ్చింది..? ఇలా ప్రశ్నిస్తే... నిజానికి సమాధానం చెప్పరు.. ఎందుకంటే వాళ్లకి కూడా తెలుసు, అన్యమతాన్ని అవలంబించాలనే నిర్ణయం వెనుక వాళ్ళు దాసోహం అనబడిన డబ్బు ఉందని..! ఆ డబ్బుని, ఆ సంపదని, కష్టపడకుండానే వచ్చి పడుతున్న ఆ ధన రాసులనీ కాదనుకోలేక, మనసుని చంపుకుని మరీ మనశ్శాంతిని పొందుతున్నారు..! చచ్చిపోయిన మనసుకి శాంతి ఎక్కడిదో మరి...!

సరే... మన ఆచారాల కారణంగా కూడా కొంతమంది బడుగు వర్గాల వారు అణగదొక్కబడ్డారు, కాబట్టే అలా వాళ్ళు అన్య మతాల వైపు చూడాల్సి వస్తోంది అని వాదించే వాళ్ళు ఉన్నారు..! నేను కూడా దాన్ని సమర్ధిస్తున్నాను..! ఎందుకంటే, అగ్రవర్ణాల వారి అరాచకాల వలన కలత చెందిన మనసులు, వాళ్ళని మనుషులుగా గౌరవించే వారి వైపుకి మొగ్గు చూపేలా చేసింది..! ఈ వాదనకి నేను కూడా వ్యతిరేకిని కాను..! కానీ నిజానికి ఏం జరుగుతోంది... సదరు బడుగు వర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అన్యమతస్థులు వాళ్ళచేత మతం మార్పిడి చేయిస్తున్నారు కానీ అది వాళ్ళ మీద ఉన్న ప్రేమతో  కాదు..!
ఒకవేళ వాళ్లకి అంత ప్రేమే ఉంటే... డబ్బుని ఎర వేసి మరీ మతం మార్చాల్సిన అవసరం ఏంటి..! వాళ్ళ మతంలో ఉన్న మంచిని, దాని గొప్పతనాన్ని చాటిచెప్పి కూడా వాళ్లలోకి ఆహ్వానించవచ్చు...! 
లేదా... మతంతో సంబంధం లేకుండా వాళ్ళని ఆర్ధికంగా పైకి తీసుకురావాలన్న చిత్తశుద్ధితో కూడా చేతనైన సహాయం చెయ్యచ్చు..! కానీ అది జరగట్లేదు..! పైగా... కొన్నిచోట్ల, పాపం అమాయకులని బెదిరించి మరీ మత మార్పిడి చేయించటం..! ఎంత అమానుషం...! ఎంత దారుణం..! ఈ పచ్చదనాల వెనుక మాటేసిన మత మౌఢ్యులు... ఎంతకి ఒడిగట్టారు...!!!
పచ్చని చీర కట్టుకున్న భూమాత ఆశీర్వాదాలు కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి అక్కడ..! అంతలోనే, పచ్చిక బయళ్ళ మధ్య నుండి వెళ్తున్న మత మౌఢ్యపు కాలి అడుగుల గుర్తులు..!

1980 - 1985 ప్రాంతంలో భారత దేశాన్ని దర్శించటానికి వాటికన్ సిటీ నుండి విచ్చేసిన ఒక సాధువుకి ఇక్కడి హైందవ వైభవాన్ని చూసి కన్ను కుట్టిందో ఏమో, ఒక పెద్ద సభలో బహిరంగంగా  - "ఏం జరుగుతోంది ఇక్కడ, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు నలభై సంవత్సరాలు గడిచినా ఇంకా ఇక్కడి జనాభాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే మన మతస్థులున్నారు... ఇక్కడ ఇంతమంది ఉండీ మీరంతా చేస్తున్నారు...ఇంకా ఎప్పటికి మన మతవ్యాప్తి జరిగేది..." అంటూ వాకృచ్చారు..! సదరు సాధువు గారు ఎవరో కాదు... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోప్ జాన్ పాల్ II. పాపం ఆయన కంగారు పడిపోయిన మతం తమ మతం అయినటువంటి క్రైస్తవ మతం..! ఇప్పుడు మన దేశ జనాభాలో దాదాపు పదమూడు శాతం మంది క్రైస్తవులు ఉన్నారు..! అంటే స్వతంత్రం సిద్ధించిన తరవాత నలభై సంవత్సరాలలో ఉన్న రెండు శాతం జనాభా ఆ తరవాత కేవలం ఇరవై ఐదేళ్ళలో మరో పది శాతానికి పెరిగింది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో  అర్ధం చేసుకోవచ్చు..!

స్వమతాన్ని కాదని అన్యమతాల వైపు చూడటం అంటే అది ఆత్మహత్యతో సమానం అని యుగపురుషుడు వివేకానందుల వారు ప్రవచించారు..! మరి ఇన్ని ఆత్మహత్యలని సర్కారు వారు ఎందుకు ఆపట్లేదు... ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే, వాళ్ళే దగ్గరుండి మరీ ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు చేయిస్తున్నారు..! స్వార్ధం..! ప్రభుత్వం నడిచేదే అన్యమతాల వారి పర్యవేక్షణలో... పాశ్చాత్య దేశాల వారి కనుసన్నల్లో..! "వారంలో ఒక రోజున ప్రత్యేకంగా ఒక ఎర్ర పుస్తకాన్ని చేతులో పట్టుకుని ప్రార్ధనా స్థలాల వైపు పరుగులు తీసినంత మాత్రానా వారు హిందువులు కాకపోరు ... ఈ సింధుగడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ హిందువే అవుతాడు..." ఈ మాట ఒకానొక సందర్భంలో సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పటం జరిగింది! నిజమే... ఎవరు ఏం చేసినా, ఏం చెయ్యాలనుకున్నా.. ఎంతగా ప్రయత్నించినా... వేల సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన నా హైందవ మతాన్ని ఏమీ చెయ్యలేరు... హాని చెయ్యాలనుకున్న ప్రతివాడు ఒకరోజున దారుణమైన ప్రతిఫలాన్ని చవిచూస్తాడు..! 

ఇతర మతాలని అగౌరవ పరచమని హిందూతత్త్వం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు, పైగా.. పరమత సహనం ఉండాలి అని కూడా చెప్పింది..! అటువంటి మనసు ఉన్న హిందువులని అకారణంగా మతోన్మాదంతో ముద్ర వేసారు... మరి దొడ్డి దారిన వచ్చి ఇక్కడి వారి మతాన్ని మార్చుతున్న వారి బుద్ధిని ఏమనాలి..! వారి మత వ్యాప్తి కోసం ఇతర మతాలని కించపరిచే విధంగా వ్యాఖ్యానించే వారు, పాటలు రాసేవారు ఉన్న ఆ వర్గాన్ని ఏమనాలి..! (ఒక పాట విన్నాను... "ఎన్నో ఏళ్ళుగా విగ్రహారాధన చేస్తూ ఉన్నాను... శాంతి కలుగలేదు, ప్రభువా నిన్ను ఆరాధించటం మొదలుపెట్టాను... బతుకు బాగుపడిందీ" అంటూ వస్తుంది ఆ పాటలోని ఒక వాక్యం..! ప్రపంచంలో విగ్రహారాధన చేసేది ఒక్క హిందువులు మాత్రమే..! మరే మతానికీ ఈ అలవాటు లేదు...! అంటే ఆ పాట రచయిత హైందవ మతారాధనని ప్రత్యక్షంగా కించపరచినట్టేగా..! ఈ నికృష్ట ఆలోచనలు హిందువులకి ఉండవు..డబ్బుకి అమ్ముడుపోయిన కక్కుర్తి మనసులకి మాత్రమే వచ్చే ఆలోచనలివి..!) అసలు దానిని ఏమైనా అనటానికి భాష అనేది ఉంటుందా..! ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేక ఇలా దోపిడీ దొంగల తీరున, రాత్రి పూట మాత్రమే సంచరించే నీచ జీవాల మాదిరిగా... అడ్డదారిలో అమాయకుల మనసుని మార్చి, సమాజాన్ని ఏమార్చినంత మాత్రాన, నా హైందవ మతానికి ఎటువంటి హానీ జరుగదు..! ఎందుకంటే హిందూత్త్వం తనని తానే రక్షించుకోగలిగే ఒక పటిష్టమైన వటవృక్షం..!

పొలం గట్ల వెంబడి కనపడే వృక్ష సౌందర్యం మనన్ని ఆశీర్వదించే శివ గణాలు అయితే, తోటల్లో కనిపించే అందమైన చెట్ల సముదాయం గంధర్వ గాన బృందం..!
పచ్చని పొలాల వెంబడి కనిపించేది కాషాయ వర్ణమే... నామ సౌందర్యమే... గోవింద వైభవమే... ఈశ్వరానుగ్రహమే...!
అక్కడి పొలాల మీదుగా వీచేది ఓంకార నాదమే..!